మనరాత మనమే రాసుకోవాలి: కీర్తి సురేష్

మనరాత మనమే రాసుకోవాలి: కీర్తి సురేష్

మహానటి కీర్తి సురేష్ విభిన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు నాగేశ్ కుకునూరు దర్శకత్వంలో వస్తున్న గుడ్ లక్ సఖి చిత్రంలో ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రను పోషించింది. మనరాతను మనమే రాసుకోవాలా అని అంటున్న కీర్తి.. అందంగా, అమాయకంగా కనిపించే ఓ పల్లెటూరి ఆడపడుచు రైఫిల్ షూటింగ్ నేర్చుకుని ఉన్నత శిఖరాలను ఎలా అధిరోహించింది అనే విషయాన్ని చిత్రంలో చూపించనున్నారు దర్శకుడు. ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో జగపతి బాబు కూడా మరో పవర్ ఫుల్ రోల్ లో నటించినట్లు టీజర చూస్తే అర్థమవుతోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story