మంత్రి బొత్స సత్యనారాయణకు సీబీఐ కోర్టు నోటీసులు
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫోక్స్ వ్యాగన్ కేసులో బొత్సకు నోటీసులు ఇచ్చింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఫోక్స్ వ్యాగన్ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్స.. ఫోక్స్వ్యాగన్ కేసులో సాక్షిగా ఉన్నారు. దీంతో వచ్చే నెల 12న కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
2005లో ఫోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది. అప్పట్లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్ వ్యాగన్ కంపెనీని హైదరాబాద్ నుంచీ వైజాగ్కి తరలించాలనే అంశంపై బొత్స, మరికొందరికి పెద్ద ఎత్తున ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకి ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. 59మంది సాక్షులుగా ఉన్నారు. ఇప్పటికే 3వేల పేజీల ఛార్జిషీట్ను సీబీఐ దాఖలు చేసింది. దాదాపు రూ.7 కోట్ల వరకూ రికవరీ అవ్వగా... ఇంకా రూ.5కోట్ల 65లక్షలు రికవరీ కావాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com