ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు ఫిర్యాదు..

ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు ఫిర్యాదు..

ఏపీ ప్రభుత్వంపై కోడెల శివప్రసాద్ రావు కూతురు విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబంపై కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వ వేధింపుల వల్లే తన తండ్రి మృతిచెందాడని పేర్కొన్నారు. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని కోరారు. కోడెల కుటుంబ సభ్యులపై వేధింపులు ఆపి.. ఏపీలో శాంతి భద్రతలు కాపాడలని విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో టీటీడీపీ అధ్యకుడు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, మద్దాలి గిరిధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story