ముందుగా పంచెతో అనుకున్నా.. కుదరకపోవడంతో..
ఏపీ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఉస్మానియా వైద్యులు పోలీసులకు అందించారు. కోడెల తన ఇంట్లోని కేబుల్ వైర్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. సూసైడ్ చేసుకునేందుకు కోడెల చాలా ఆలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా పంచెతో ఉరి వేసుకొని చనిపోవాలనుకున్నా, అది కుదరకపోవడంతో కేబుల్వైర్తో హ్యాంగయ్యారు.. కోడెల మెడపై ఉన్న గుర్తులను బట్టి అది కేబుల్ వైరేనని తేల్చారు.
ఆరోగ్యం బాగోలేక కోడెల వాడుతున్న మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోడెల కాల్డేటాపైనా ఫోకస్ చేశారు. ఆయన చివరిగా క్యాన్సర్ ఆస్పత్రి వైద్యురాలికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఉన్న అందరినీ ఇప్పటికే ప్రశ్నించారు పోలీసులు. మరికొంత మందిని విచారిస్తామని చెబుతున్నారు.
ఆత్మహత్య చేసుకోవాలని కోడెల శివప్రసాదరావు ముందుగానే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 20 రోజుల క్రితమే కోడెల హైదరాబాద్కు వచ్చారు. ఇక ఈ కేసులో కోడెల భార్య, కూతురు, గన్మన్, డ్రైవర్తో పాటు..మరో నలుగురిని ప్రత్యక్షసాక్షులుగా పేర్కొన్నారు పోలీసులు. అయితే పోస్ట్మార్టం నివేదికపై పోలీసులు అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com