పోలీసుల తీరుతో మనస్థాపం.. వివాహిత ఆత్మహత్య..

పోలీసుల తీరుతో మనస్థాపం.. వివాహిత ఆత్మహత్య..

విశాఖ జిల్లా అరిలోవాలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థల వివాదంలో.. పోలీసుల తీరుతో మనస్థాపానికి గురైన ఆమె.. ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి స్థలంపై నారాయణ శెట్టికి.. అతని తల్లిదండ్రులకు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణశెట్టి తల్లిదండ్రులు. దీంతో నారాయణశెట్టిని స్టేషన్‌కు తీసుకెళ్లారు పోలీసులు. సివిల్‌ తగాదా కాబట్టి ఈ కేసును కోర్టులో తేల్చుకుంటామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదంటున్నాడు నారాయణశెట్టి.

ఇవేవి పట్టించుకోని సీఐ... తనను అర్ధరాత్రి స్టేషన్లో నిర్బంధించాడని, తనపై థర్డ్‌ డిగ్రీ కూడా ప్రయోగించాడంటున్నాడు నారాయణశెట్టి. అటు.. తన భార్యను సైతం బెదిరించినట్లు తెలిపాడు. స్టేషన్‌కు వెళ్లిన తాను అర్ధరాత్రి వరకు స్టేషన్‌లో ఉండటం, మరోవైపు పోలీసులు బెదిరించడంతో... తీవ్ర మనస్థాపానికి గురైన తన భార్య ఆత్మహత్య చేసుకుందంటున్నాడు నారాయణశెట్టి. తన భార్య మృతికి పోలీసులే కారణమంటున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story