శివప్రసాద్ మృతిపట్ల నారా లోకేష్ సంతాపం
మాజీ ఎంపీ శివప్రసాద్ మృతిపట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. నాయకుడిగా, నటుడిగా శివప్రసాద్ ప్రజల మనసులు గెలుచుకున్నారని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి శివప్రసాద్ ఎంతో కృషి చేశారన్నారు లోకేష్. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ వేదికగా ఆయన అలుపెరుగని పోరాటం చేశారన్నారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నారా లోకేష్.
ఇటు టీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా శివప్రసాద్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థించారు. 15 వ లోక్సభలో శివప్రసాద్తో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను నామా గుర్తు చేసుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com