వైసీపీ రంగులోకి మారిపోనున్న గ్రామ సచివాలయాలు
By - TV5 Telugu |31 Aug 2019 4:54 AM GMT
ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ సచివాలయాలు ఇక వైసీపీ రంగుల్లోకి మారిపోనున్నాయి. అక్టోబర్ 2 నుంచి విలేజ్ సెక్రటేరియట్లో ఈ మార్పు కనిపించనుంది. పంచాయతీ భవనాలన్నీ కొత్త రంగుల్లోకి మార్చాలంటూ గ్రామ సచివాలయ భవన నమూనాను అన్ని జిల్లాలకు పంపింది పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే భవనాలకు సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com