ఖ‌రారైన అమిత్ షా తెలంగాణ టూర్.. బీజేపీలోకి పలువురు కీలక నేతలు..?

ఖ‌రారైన అమిత్ షా తెలంగాణ టూర్.. బీజేపీలోకి పలువురు కీలక నేతలు..?

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ ఖ‌రారైంది. 6వ తేదీన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న లాంచ‌నంగా ప్రారంభించ‌నున్నారు. సాయంత్రం హైద‌రాబాద్ చేరుకోనున్న అమిత్ షా నేరుగా సీఐఎస్ఎఫ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అనంత‌రం బాలాపూర్ మండ‌లంలోని కార్య‌క‌ర్త సోని ఇంటికి నేరుగా వెళ్ళి స‌బ్య‌త్వం ఇవ్వ‌నున్నారు. అమిత్ షా త‌న ఇంటికి రావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తోంది గిరిజ‌న మహిళ సోనీ నాయ‌క్. ద‌శాబ్దాలుగా బీజేపీనే న‌మ్ముకున్నామ‌ని.. ఆ పార్టీతోనే త‌మ‌కు ఇంటి ప‌ట్టాలు వ‌చ్చాయ‌ని.. పార్టీ త‌మ‌కు చేసిన మేలును మ‌ర‌చి పోలేమ‌ని.. భ‌విష్య‌త్తులో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా బీజేపీ కోసం సోనీ నాయ‌క్ ప‌నిచేస్తామన్నారు.

అలాగే ఈ టూర్ పలువురు కీలక నేతలు బీజేపీలొ చేరే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story