విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
By - TV5 Telugu |22 Aug 2019 4:09 PM GMT
కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. ఏం కష్టమొచ్చిందో... కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెలగల బల రామకృష్ణారెడ్డితో పాటు అతని భార్య సుబ్బలక్ష్మీ, కుమారుడు గంగాధర్రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆత్మహత్యకు కారణం ఏంటి? కుటుంబ కలహాల లేక ఆర్థిక సమస్యలా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com