మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 348వ ఆరాధనోత్సవాలు
By - TV5 Telugu |18 Aug 2019 4:05 AM GMT
కర్నూలు జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన వైభవంగా జరిగింది. ప్రహ్లాదరాయుల ఉత్సవమూర్తిని గజవాహనంపై ఆశీనులను చేసి మఠం ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం పండితుల వేద మంత్రాలతో మఠం పీఠాదిపతులు ఊంజల్ సేవ నిర్వహించారు.
ఉత్సవమూర్తిని ఐదు రథాలపై మఠం ప్రాంగణవంలో ఊరేగించారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి సజీవ బృందవనస్తులైన రోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com