బామ్మ గారి వ్యాపారానికి ఆనంద్ మహీంద్రా పెట్టుబడి

బామ్మ గారి వ్యాపారానికి ఆనంద్ మహీంద్రా పెట్టుబడి

80 ఏళ్ల వయసులో ఏం చేయగలనని ఏనాడూ అనుకోలేదు ఆ బామ్మ. నలుగురికీ నాలుగు ఇడ్లీలు తయారు చేసే ఓపిక ఇచ్చాడు ఆ భగవంతుడు అని.. అదీ కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తోంది. ఒక్కరూపాయికే నాలుగు ఇడ్లీలు అందిస్తూ ప్రపంచానికి తనని తాను పరిచయం చేసుకుంది. రూపాయికి ఏమొస్తుంది అని అనుకునే ఈ రోజుల్లో నాలుగు ఇడ్లీలు ఇచ్చి పేదల కడుపునింపుతోంది. తన పడుతున్న కష్టాన్ని కడుపులోనే దాచుకుంది.

మహీంద్రా గ్రూప్ చైర్మన్‌ని ఆకర్షించిన బామ్మ.. ఈసారి నుంచి కట్టెల పొయ్యి మీద ఇడ్లీ వండక్కర్లేదు మీరు.. మీ అడ్రస్ చెబితే గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని మాట ఇచ్చారు. కానీ అంతలోనే బామ్మ గారి అడ్రస్ కనుక్కొని భారత్ గ్యాస్ వాళ్లు ఫ్రీగా కనెక్షన్ ఇచ్చేశారు. ఆ విషయానికి స్పందించిన మహీంద్రా.. భారత్ గ్యాస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇక మీదట వంట గ్యాస్‌కు అయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను అంటూ బామ్మ గారికి భరోసా ఇచ్చారు. రోజుకు వెయ్యి ఇడ్లీలను అమ్మే ఈ బామ్మ ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే పనే నా ఆరోగ్యం అంటూ బోసి నవ్వుతో చెబుతోంది. యువతకు స్ఫూర్తినిస్తోంది బామ్మ. అదే ఆనంద్ మహీంద్రాను ఆకర్షించింది.

Tags

Read MoreRead Less
Next Story