ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గొడుగు..

ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గొడుగు..

సాయం చిన్నదే కావచ్చు. కానీ పెను ప్రమాదం తప్పింది. వందల మంది ప్రాణాలు గాల్లో కలవకుండా కాపాడింది. రైలు ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన కూరగాయల వ్యాపారి వారి పాలిట దేవుడయ్యాడు. మహారాష్ట్రలోని కంజుర్ మార్గ్, బండప్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. బద్లాపూర్ రైలు.. స్టేషన్‌కు చేరుకోవడానికి కొన్ని నిమిషాల ముందు భారీగా జెర్క్ ఇచ్చినట్లు గుర్తించి ఎమర్జెన్సీ కంట్రోల్‌కు ఇంజిన్ డ్రైవర్ తెలిపాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న కూరగాయల వ్యాపారి కూడా ట్రాక్ తప్పడాన్ని గుర్తించాడు. వెంటనే తన చేతిలో ఉన్న గొడుగు పైకెత్తి ట్రైన్‌కి సిగ్నల్ ఇచ్చాడు. ఇంజిన్ డ్రైవర్లు గుర్తించి వెంటనే రైలుకు బ్రేక్ వేసారు. లేదంటే రైలు పట్టాలు తప్పి భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. కనీసం 1.5 అడుగుల వరకు ట్రాక్ తప్పిపోయింది. కూరగాయల వ్యాపారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో రైల్వే ట్రాక్ మిస్ అవడానికి గల కారణాలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కూరగాయల వ్యాపారికి రైల్వే అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story