పదవతరగతి అర్హతతో నేవీలో 'సెయిలర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

పదవతరగతి అర్హతతో నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదవతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.205 చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.

ఇండియన్ నేవీలో ఏప్రిల్-2020 బ్యాచ్‌కు సంబంధించి 'సెయిలర్' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు పోస్టుల వివరాలు.. 400 పోస్టులు.. చెఫ్, స్టీవార్డ్, హైజినిస్ట్.. అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత.. నిర్గిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వయసు: 01.04.2000 - 31.03.2003 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు ఫీజు: రూ.205. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ద్వారా.. శిక్షణ: రాత పరీక్ష, ఇతర పరీక్షల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు 2020 ఏప్రిల్‌లో 15 వారాల పాటు ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్రైనింగ్‌తో పాటు ఇతర నావికాదళ శిక్షణ కూడా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 26.07.2019.. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.08.2019.

Tags

Read MoreRead Less
Next Story