మరోసారి ఫేస్బుక్లో ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
By - TV5 Telugu |12 Jun 2019 5:43 AM GMT
కేశినేని నాని ఫేస్బుక్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తినని.. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదని అన్నారు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే తన నైజమని చెప్పుకొచ్చారు. అన్యాయాన్ని అన్యాయమని చెప్పడంలో తాను ఎప్పుడూ వెనకడుగు వేయబోనన్నారు. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాని గుర్తు చేసుకున్నారు. నిండు సభలో మోడీని నిలదీశానని అన్నారు. భయం తన రక్తంలో లేదని.. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదని కామెంట్ పెట్టారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com