పడుకున్న కోహ్లీ.. పక్కనే దిగులుగా అనుష్క.. ట్రోల్స్

పడుకున్న కోహ్లీ.. పక్కనే దిగులుగా అనుష్క.. ట్రోల్స్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌‌లో టీమిండియా అలుపెరుగని పోరాటమే చేసింది. గెలుపు పిలుపు వినిపించాలని, కోట్లాది మంది క్రికెట్ ప్రేమికుల హృదయాలను చూరగొనాలని ఉవ్విళ్లూరింది. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 18 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో వరుసగా టీమిండియా రెండో సారి సెమీస్‌లో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. న్యూజిలాండ్ వరుసగా రెండోసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 2015లో జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఫైనల్స్ వరకు వెళ్లి ఆసిస్ చేతిలో పరాజయం పాలైంది. అయితే మరోసారి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలపై.. అనుష్క నటించిన సూయీ దాగా సినిమాలోని క్లిప్పింగ్స్‌ని జత చేసి ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా టాపార్డర్ కుప్పకూలినప్పటికీ జడేజా, ధోనీ చేసిన అసమాన పోరాటం భారతీయుల అభిమానాన్ని దోచుకుంది.

Tags

Read MoreRead Less
Next Story