తాతయ్య ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు - శివప్రసాద్ మనవడు

తాతయ్య ఆరోగ్యంపై వదంతులు నమ్మొద్దు - శివప్రసాద్ మనవడు

మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం విషమంగానే ఉంది. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నాటి కంటే కొద్దిమేర కోలుకుంటున్నా..ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు.

శివప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. మాజీ ఎంపీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు టీడీపీ అధినేత. తన చిన్ననాటి స్నేహితుడు త్వరగా కోలుకుంటారని శివప్రసాద్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు.

శివప్రసాద్ కొన్నాళ్లుగా మూత్ర పిండాల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చెన్నై ఆసుపత్రిలో ఇప్పటికే రెండు వారాల పాటు చికిత్స తీసుకున్నారు. ట్రీట్మెంట్ తర్వాత ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇంతలోనే మరోసారి మూత్ర పిండాల్లో సమస్య తలెత్తడంతో గురువారం మళ్లీ చెన్నై ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

శివప్రసాద్ ఆరోగ్యంపై శుక్రవారం నుంచి వదంతులు వ్యాపించాయి. దీంతో ఆయన కుటుంబసభ్యులు శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని శివప్రసాద్ మనవడు క్లారిటీ ఇచ్చాడు. శివప్రసాద్ ఆరోగ్యం విషమంగానే ఉన్నా.. కోలుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story