ఆయిల్ కోసం ఆశ పడి.. 60 మంది బలి

ఆయిల్ కోసం ఆశ పడి.. 60 మంది బలి

బోల్తా పడిన ట్యాంకర్‌ నుంచి లీకైన అయిల్‌ను తీసుకోవడానికి ప్రయత్నించారు టాంజానీయా వాసులు. ఆ సమయంలో ట్యాంకర్ పేలడంతో దాదాపు 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ఆర్ధిక రాజధాని డార్ ఎస్ సలానికి 175 కీ.మీ దూరంలో ఉన్న మెురోగోరో ప్రాంతంలో ఓ చమురు ట్యాంకర్ బోల్తా పడింది. దానిలో ఉన్న అయిల్‌ని తీసుకోవడానికి స్ధానికులు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. వారిలోని ఓ వ్యక్తి సిగిరెట్ అంటించడంతో దాని నిప్పు రవ్వలు ఇంధనంపై పడి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారంతా కాలి బూడిదయ్యారు. ఈ ఘటనలో 61 మంది మృతి చెందగా 70 మందికి గాయాలయ్యాయి. వారిలో చాలా మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఆఫ్రికా దేశాలలో తరుచుగా జరుగుతున్నాయి. ఈ విషయంపై ప్రజలల్లో అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story