ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌

ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌

నిజామాబాద్‌ ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌లో ఘోరం జరిగింది. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి ఎస్సై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో.. వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే.. హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్‌రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో.. ప్రకాష్‌రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడు ప్రకాష్‌ రెడ్డి కి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. మరో 8 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ప్రకాష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సిపి కార్తికేయ ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి వివరాలు తెలుసుకున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story