మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్న సీఎం జగన్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.ప్రజలకు మరింత చేరువయ్యి వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 8.30 వరకు ప్రజల విన్నపాలు స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అక్కడిక్కడే పరిష్కరిస్తారు. లేని పక్షంలో సంబంధిత అధికారులకు అప్పగిస్తారు.ఈ మేరకు ప్రజాదర్బార్కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో గెలిస్తే రాజన్న రాజ్యాన్ని తెస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు తన పాలనలో తండ్రి మార్కును చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పథకాలకు పేరు మార్చి ‘వైఎస్ఆర్’ పేరుతో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు తన తండ్రి పాలన గుర్తొచ్చేలా ప్రజా దర్భార్ను ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రజాదర్బార్ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com