సీఎం జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ

సీఎం జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ

రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ వైఖరిపై జపాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపిన జపాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ అంశంపై వైఎస్ జగన్‌కు జపనీస్ అంబాసిడర్ లేఖ రాశారు. ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. సైన్ అండ్ సీల్ చేసిన కాంట్రాక్ట్‌లను రివ్యూ చేయడం వల్ల పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం చూపుతుందని జపాన్ అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలతో ఫారిన్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొంటాయన్నారు. ఇండియా రెన్యూవబుల్ సెక్టార్‌లో ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా వస్తున్నాయని.. ఇలాంటి సమయంలో నిర్ణయం సరైంది కాదన్నారు. ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, యూరోప్ కంపెనీలు టెండర్లలో పాల్గొంటున్నాయి. ఇప్పటికే జపాన్ పలు ఒప్పందాలు చేసుకుందన్నారు.

ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి పలు వర్గాల నుంచి లేఖలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ఒప్పందాల విషయంలో సమీక్షలు, రద్దు చేయడం వల్ల దేశీయంగా విదేశీ పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపింది. ఇప్పటికే పలు కంపెనీలు కూడా ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులను ఆశ్రయించాయి. మొత్తానికి రెన్యూవబుల్ ఎనర్జీ టారిఫ్‌ల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ వైఖరిపై వ్యతిరేకత వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story