ప్రధాని మోదీ భార్యను కలుసుకున్న మమతాబెనర్జీ
By - TV5 Telugu |18 Sep 2019 2:57 PM GMT
ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను కలుసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ సందర్బంగా ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో జశోదాబెన్ కోల్కత్తా నుంచి ధన్బాద్ వెళ్లేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఎదురుపడటంతో ఒకరినొకరు పలకరించుకున్నారు. పరస్పరం యోగక్షేమాలు అగిడి తెలుసుకున్న తరువాత.. జశోదాబెన్కు మమత చీర బహుకరించారు. కాగా ప్రధాని మోదీతో మమతాబెనర్జీ బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మోదీకి కుర్తా, బెంగాలీ స్వీట్స్ను బహుకరించారు మమత.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com