రెప్పపాటు క్షణంలో చావు వరకూ వెళ్ళీ..
రెప్పపాటు క్షణంలో.. చావు వరకూ వెళ్లి బతికాడు ఓ యువకుడు. ఈ ఘటన కేరళలో జరిగింది. కోజికొడ్లోని ఎంగపుజా ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ వీరంగం సృష్టించాడు. బస్ను ఫుట్పాత్ దగ్గర అతివేగంగా నడిపాడు. అదే సమయంలో రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ స్కూటరిస్ట్ అనుకోకుండా ఆ బస్సు కింద పడ్డాడు. వేగాన్ని నియంత్రించలేని బస్సు డ్రైవర్... స్కూటర్ను చాలా దూరం వరకు తీసుకెళ్లాడు. ఈ ఘటనలో యువకుడు బస్సు టైరులో చిక్కుకుపోయాడు. ఇది గమనించిన స్థానికులు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో.. బస్సును ఆపాడు డ్రైవర్.
ఇంత పెద్ద ప్రమాదం జరిగినా... ఆశ్చర్యంగా ఆ యువకుడు ప్రాణాలతో బయటపడటం విశేషం. బస్సును ఆపడంతో అతడు అందులో నుంచి బయట పడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు ఫుట్పాత్ పక్కన ఓ దుకాణంలో అమర్చిన సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సంఘటనలో బాధితుడికి తీవ్రంగా గాయాలయ్యాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com