ఆ విషయంలో శివప్రసాద్ చాలా సక్సెస్ అయ్యారు..
చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్కు అంత్యంత గుర్తింపు తెచ్చాయి అతడి వేషధారణలే.. ముఖ్యంగా రాష్ట్ర విభజన తరువాత ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాటం చేయడంలో శివ ప్రసాద్ కీలక పాత్ర పోషించారు.. విభజన కారణంగా రాష్ట్ర ఎదుర్కొంటున్న సమస్యలను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన చాలా సక్సెస్ అయ్యారు.
పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా రోజుకో ప్రత్యేక వేషధారణతో హాజరై.. వినూత్న నిరసనలతో అందరి దృష్టిని ఆకర్షించేవారు. ప్రధాని మోదీ కూడా తన ప్రసంగంలో శివ ప్రసాద్పై ప్రశంసలు కురిపించారు. ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ సైతం శివ ప్రసాద్ పోరాటం చూసి అభినందించారు.
రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి ఆయన వినూత్న వేషధారణలో ప్రతి సందర్భంలో నిరసనలు తెలియజేస్తూనే వచ్చారు. ఢిల్లీలోనే కాదు.. ఏపీలో ధర్మపోరాట దీక్షల సమయంలోనూ ప్రత్యేక గెట్ప్లతో పోరాట పంథాను ఎంచుకున్నారు. ముఖ్యాంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేస్తూ రోజుకో వేషధారణతో యావత్ భారత దేశం చూపును తవైపునకు తిప్పుకోవడంలో శివ ప్రసాద్ చాలా వరకు సక్సెస్ అయ్యారు.
స్వతహాగా కళాకారుడైన శివ ప్రసాద్.. ఏ వేషం వేసుకున్నా అందులో ఒదిగిపోయేవారు. వేషధారణకు తగ్గట్టే తన భాషను కూడా మార్చుకునే వారు. ఓ వైపు మాటల తూటాలు పేలూస్తూనే.. మరో వైపు పాటలు, పద్యాల రూపంలోనూ నేరుగా కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com