బాంబు దాడి.. 16మంది మృతి.. 120 మందికి గాయాలు

బాంబు దాడి..  16మంది మృతి.. 120 మందికి గాయాలు

కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్రీన్ విల్లే సమీపంలో బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ తమ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనపై చర్చించేందుకు కాబూల్ వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికిచేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Read MoreRead Less
Next Story