కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిని కలిసిన టీడీపీ నేతలు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని కిషన్ రెడ్డిని కోరారు. కోడెల కుటుంబ సభ్యులపై వేధింపులు ఆపి.. ఏపీలో శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన్ రావు, మద్దాలి గిరిధర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమన్నారు కిషన్ రెడ్డి. కోడెల మృతిపై కేంద్రంతో దర్యాప్తు చేయిస్తామన్నారు. పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయని.. ఏ ప్రభుత్వం అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదన్నారు కిషన్ రెడ్డి. కోడెల మృతిపై ఏపీ సీఎం, సీఎస్, డీజీపీల వివరణ కోరతానన్నారు.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com