జైలులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్
By - TV5 Telugu |14 Jun 2019 3:29 PM GMT
హుజూర్ నగర్ సబ్ జైలులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చింతపాలెం మండలం తమ్మారం, కొత్తూరు గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ కేసులో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో సబ్ జైలుకు వెళ్లిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..కాంగ్రెస్ కార్యకర్తలను పరామర్శించి ఘర్షణకు దారి తీసిన పరిస్తితులను అడిగితెల్సుకున్నారు. ఆ తర్వాత హుజూర్ నగర్ ఎంపీపీ స్థానిక పార్టీ ఆఫీసులో ఉత్తమ్ కుమార్ను సన్మానించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com