నిర్మాణ దశలోనే కూలిన బ్రిడ్జి..

నిర్మాణ దశలోనే కూలిన బ్రిడ్జి..

సిరిసిల్ల వేములవాడ జిల్లాలో మూలవాగుపై నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పాక్షికంగా కూలిపోయింది. వరద ఉధృతికి ఒక్కసారిగా పిల్లర్లు పక్కకు ఒరిగిపోయాయి. వీటికి సపోర్ట్‌గా ఉంచిన సెంట్రింగ్ కూడా కొట్టుకుపోయింది. కొన్నాళ్లుగా ఈ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. మధ్యలో నిధుల్లేక ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు మూలవాగు ప్రవాహానికి ఏకంగా పాక్షికంగా కూలిపోవడం కలకలం రేపుతోంది.

కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు అంటున్నారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. 22 కోట్లతో మొదలైన పనులు నెలల తరబడి సాగుతున్నాయని.. సరైన పర్యవేక్షణ లేని కారణంగా బ్రిడ్జి భద్రతపైనే అనుమానాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story