తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి హైకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు మరోసారి హైకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు మరోసారి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. టిఆర్ఎస్ ఎల్పీలో సిఎల్పీ విలీనం చేస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ ను సవాల్ చేస్తూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అసెంబ్లీ స్పీకర్ తో పాటు.. 12 మంది ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి ఈ నోటీసులు ఇచ్చింది కోర్టు.

అంతకుముందు మంగళవారం 10 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం మంగళవారం స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చారు. అటు మండలిలో ఎమ్మెల్సీల విలీనంపై షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన న్యాయస్థానం మండలి ఛైర్మన్, మండలి కార్యదర్శి, ఈసీకి నోటీసులు ఇచ్చింది. మొత్తానికి విలీనంపై స్పీకర్ కు వరసగా రెండోరోజు కూడా నోటీసులు రావడం గమనార్హం.

Tags

Read MoreRead Less
Next Story