హృదయాన్ని కలిచివేసే దృశ్యం.. లేగ దూడ చనిపోవడంతో తల్లి ఆవు..

హృదయాన్ని కలిచివేసే దృశ్యం.. లేగ దూడ చనిపోవడంతో తల్లి ఆవు..

కన్న తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ కోసం ఎంతో తాపత్రయపడుతుంది. బిడ్డకు ఏదైనా జరిగితే, తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అది మనుషులైనా, జంతువులైనా ఒకటే. కళ్ల ముందే కారు ఢీ కొని లేగ దూడ చనిపోవడంతో, ఓ తల్లి ఆవు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.

జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వేగంగా వెళ్తున్న కారు.. లేగ దూడను ఢీకొట్టింది. దీంతో దూడ అక్కడికక్కడే చనిపోయింది. అక్కడే ఉన్న తల్లి ఆవు.. దూడ దగ్గరికి వచ్చింది. తన బిడ్డ లేదని తెలుసుకుందో ఏమో, ఆవు కంటి నుంచి నీళ్లు జలజలా రాలాయి. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలిచివేసింది. లేగ దూడను ఢీ కొట్టిన కారు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ ఆవు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story