బోర్డర్లో కాల్పుల మోత.. మరోసారి అదే పనిచేసిన పాకిస్థాన్
దేశమంతటా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతుంటే బోర్డర్లో మాత్రం కాల్పుల మోత మోగింది. కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ దాడికి తెగబడింది. రాజౌరి, ఉరీ సెక్టార్లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పులను ధీటుగా ఎదుర్కొన్న భారత సైనికులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో ముగ్గురు పాకిస్తాన్ జవాన్లు హతమైనట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అంతేకాదు పాక్కు చెందిన పలు బంకర్లు కూడా ధ్వంసమైనట్లు సమాచారం.
చేయాల్సిందంతా చేసి మనపై నిందలు మోపే పాకిస్థాన్.. మరోసారి అదే పనిచేసింది. భారత సైన్యమే కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తోంది. పాకిస్తాన్ చేసిన ఎదురుదాడిలో ఐదుగురు భారత సైనికులు చనిపోయారని చెబుతోంది. ఐతే పాకిస్తాన్ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. మన సైన్యానికి ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఎల్వోసీ వెంబడి కాల్పులతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also watch
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com