పాకిస్థాన్కు దిమ్మతిరిగే షాక్
పాకిస్థాన్కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అఖండ భారత్ నినాదం పాక్ గడ్డపై వినిపించింది. భారత్కు మద్దతుగా పాకిస్థాన్ రాజధానిలో బ్యానర్లు వెలిశాయి. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ సర్కా రు తీసుకున్న నిర్ణయాన్ని ఆ బ్యానర్లలో ప్రశంసించారు. అంతటితో ఆగకుండా అఖండ భారత్ లక్ష్యాన్ని మోదీ పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు పాక్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్తో కూడిన అఖండ భారతదేశ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇస్లామాబాద్లోని ప్రెస్ క్లబ్, సెక్టార్-F-6, అబ్పారా చౌక్లలో ఈ బ్యానర్లు కని పించాయి.
అఖండ భారత్ బ్యానర్లు పాకిస్థాన్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, వెంటనే వాటిని తొలగించారు. ఈ ఘటనలో ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా కోర్టు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com