పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అఖండ భారత్ నినాదం పాక్ గడ్డపై వినిపించింది. భారత్‌కు మద్దతుగా పాకిస్థాన్ రాజధానిలో బ్యానర్లు వెలిశాయి. జమ్మూ కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ మోదీ సర్కా రు తీసుకున్న నిర్ణయాన్ని ఆ బ్యానర్లలో ప్రశంసించారు. అంతటితో ఆగకుండా అఖండ భారత్ లక్ష్యాన్ని మోదీ పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు పాక్‌, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌తో కూడిన అఖండ భారతదేశ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇస్లామాబాద్‌లోని ప్రెస్‌ క్లబ్‌, సెక్టార్‌-F-6, అబ్‌పారా చౌక్‌లలో ఈ బ్యానర్లు కని పించాయి.

అఖండ భారత్ బ్యానర్లు పాకిస్థాన్‌లో పెను ప్రకంపనలు సృష్టించాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు, వెంటనే వాటిని తొలగించారు. ఈ ఘటనలో ఓ అనుమానితుణ్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లా కోర్టు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story