వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన

ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార వైఎస్సార్‌సీపీ ఈ మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, హిందూపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మొహమ్మద్ ఇక్బాల్, కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఈమేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్‌కు గడువు ముగియనుండడంతో వైఎస్సార్‌సీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. 13 లేదా 14వ తేదీన ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story