నా స్నేహితులను కలుసుకునేందుకు వచ్చాను: డీకే శివకుమార్
కర్ణాటకలో స్పీకర్ నిర్ణయంతో కాస్త ఉపశమం కల్గిందని భావించినా... సస్పెన్స్ మాత్రం కొనసాగుతునే ఉంది. ముంబైలో రెబల్ ఎమ్మెల్యేను బుజ్జిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ - జేడీఎస్. ఇందుకోసం కర్ణాటక మంత్రి డికే శివకుమార్, జేడీఎస్ ఎమ్మెల్యే శివలింగ గౌడ.... ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు. రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తోన్న హోటల్ వద్దకు చేరుకున్నారు. అయితే... వీరిద్దరిని అడ్డుకున్నారు పోలీసులు. లోపల్నికి వెళ్లనిచ్చేది లేదన్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే తాను తన స్నేహితులను కలుసుకునేందుకు వచ్చానన్నారు డికే శివకుమార్.
రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ముంబై పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. తమను కలిసేందుకు వచ్చే నేతలనుంచి రక్షణ కల్పించాలంటూ... లేఖలో కోరారు. దీంతో హోటల్ వద్ద భారీగా పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. హోటల్లో ఎవ్వరిని అనుమతించడం లేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com