ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ఘర్షణ
By - TV5 Telugu |10 July 2019 12:13 PM GMT
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయ సదస్సు రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు దిగారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో గొడవ జరిగింది. కృపేష్పై కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడి చేయడంతో సదస్సు ప్రాంగణంలో గందరగోళం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ముదిరి తోపులాట జరిగింది. టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ జెడ్పీటీసీఎసీలు ఆందోళన చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com