విజయవాడలో రెచ్చిపోతున్న బ్లేడ్ బ్యాచ్
By - TV5 Telugu |8 Aug 2019 6:14 AM GMT
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోతోంది. జనావాసాల మధ్యే దాడులు చేస్తూ వణికిస్తోంది. తాజాగా కృష్ణలంక నెహ్రూ నగర్లో సీతారామయ్య అనే డ్రైవర్పై దాడి చేశారు. ఆర్టీసీ బస్స్టాండ్, రైల్వే ట్రాక్, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్ అడ్డాలుగా ఈ ముఠా దందాలకు దిగుతోంది. ఒంటరిగా ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తోంది. కొన్నాళ్లుగా జరుగుతున్న ఆగడాలు భరించలేక.. తమకు రక్షణ కల్పించాలంటూ స్థానికులు వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com