ఆందోళనలో పాల్గొన్న హీరో రాజశేఖర్
By - TV5 Telugu |8 Aug 2019 11:01 AM GMT
NMC బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు.. టాలీవుడ్ హీరో.. డాక్టర్ రాజశేఖర్ మద్దతు పలికారు. కుటుంబ సమేతంగా ఇందిరా పార్క్కు వచ్చిన ఆయన... డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. మద్రాస్ మెడికల్ కాలేజీలో తాను మెడిసిన్ పూర్తి చేశానని... వైద్య విద్యార్థుల వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. NMC బిల్లు పాస్ అయ్యే ముందు అనుభవజ్ఞులైన వైద్యులను కమిటీలో ఉంచాలని సూచించారు. ఈ బిల్లు వస్తే ప్రజా ఆరోగ్యం దెబ్బ తింటుందంన్నారు డాక్టర్ రాజశేఖర్.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com