తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రారంభించిన ప్రధానులు
దక్షిణాసియాలో తొలి సీమాంతర పెట్రోలియం పైప్లైన్ను ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని కే.పీ.శర్మ ఓలీ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్లోని మోతీ హారీ, నేపాల్లోని ఆమ్లేఖ్గంజ్ మధ్య ఈ పైప్లైన్ నిర్మించారు. దీని పొడవు 60 కిలోమీటర్లు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఈ పైప్లైన్ ఇరుదేశాల మధ్య మైత్రికి నిదర్శనమన్నారు ప్రధాని మోదీ. దీని నిర్మాణంలో నేపాల్ ప్రభుత్వ సహకారం మరువలేనిదన్నారు. ఇరుదేశాల కృషి వల్లే ఈ చరిత్రాత్మక ప్రాజెక్ట్.. అనుకున్న సమయానికంటే ముందే పూర్తైందన్నారు మోదీ..
1996లోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ.. 2016లో మోదీ నేపాల్ పర్యటన తర్వాతనే ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఏడాదిలో ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ అది కాలేదు. నేపాల్లోని పార్సా జాతీయ పార్క్లో చెట్ల నరికివేతకు అనుమతులు ఇచ్చే విషయంలో జాప్యం జరిగింది.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com