ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంచిన హోటల్ యజమానిపై ఎస్సై దాడి
By - TV5 Telugu |22 Sep 2019 10:04 AM GMT
వరద బాధితుల కష్టాలు చూసి ఓ హోటల్ యజమాని కడుపు తరుక్కుపోయింది. కనీసం ఒక పూటైనా వాళ్ల కడుపు నింపాలనుకున్నాడు. అందరికీ ఉచితంగా భోజనం ప్యాకెట్లు పంచాడు. ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ అయిందని స్థానిక ఎస్సైకి కోపమొచ్చింది. హోటల్ యజమానితో దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు ఎస్సై.
ఈ ఘటన కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లె మెట్ట వద్ద జరిగింది. అమరావతి హోటల్ యజమాని మాదవరెడ్డి భోజనం ప్యాకెట్లు పంచడం వల్లే ట్రాఫిక్ జామ్ అయిందని చేయిచేసుకున్నాడు ఎస్సై తిమ్మారెడ్డి.
Also watch :
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com