పీఏసీ చైర్మన్గా మజ్లిస్ పక్షనేత.. శాసనసభ కమిటీలకు చైర్మన్లు వీరే..
తెలంగాణ శాసనసభ స్థాయి సంఘాలకు చైర్మన్లు దాదాపు ఖరారయ్యారు. కీలకమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి MIM పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీకి దక్కనుంది. కాంగ్రెస్కు ప్రతిపక్షహోదా పోయిన తర్వాత.. ఆ స్థానంలోకి మజ్లిస్ వచ్చింది. ఆ లెక్క ప్రకారం.. పీఏసీ పదవి వారికి ఇవ్వనున్నారు. స్పీకర్ పోచారం కాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.
*శాసనసభ స్థాయి సంఘాల చైర్మన్లు ఖరారు.. *పీఏసీ చైర్మన్గా మజ్లిస్ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ *పీయూసీ చైర్మన్గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి *ఎథిక్స్ కమిటీ చైర్మన్గా డిప్యూటీ స్పీకర్ పద్మారావు *అంచనాల కమిటీ చైర్మన్గా సోలిపేట రామలింగారెడ్డి *ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా కాలె యాదయ్య *ఎస్టీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా రెడ్యూ నాయక్ *ప్రివిలేజ్ కమిటీ చైర్మన్గా స్పీకర్ పోచారం *పేపర్స్ లేడ్ ఆన్ టేబుల్ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ జాఫ్రి నియమితులయ్యారు.
Also watch :
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com