వాళ్లెంతో స్పెషల్.. 60 ఏళ్లు దాటినా అందంగా.. ఆరోగ్యంగా.. ఆ పండ్లు తినడం వల్లే..

వాళ్లెంతో స్పెషల్.. 60 ఏళ్లు దాటినా అందంగా.. ఆరోగ్యంగా.. ఆ పండ్లు తినడం వల్లే..

మంచి ఆరోగ్య అలవాట్లు ఉంటే వయసు మీదపడినా అనారోగ్యం దరి చేరదు. ఆసుపత్రులకు పరిగెట్టే పని ఉండదని పెద్దలు చెబుతుంటారు. 30 ఏళ్లు దాటితేనే ఏదో ఒక అనారోగ్యం చుట్టుముడుతున్న ఈ రోజుల్లో అక్కడి తెగ వారికి మాత్రం 60 ఏళ్లు వచ్చినా ఆరోగ్యంగా ఉంటారు. 70 ఏళ్లు మీదపడ్డా చర్మం ఏ మాత్రం ముడతలు పడకుండా యవ్వనంగా కనిపిస్తుంటారు. వారే పాకిస్తాన్‌ హుంజా ప్రాంతంలో నివసిస్తున్న బురుషా తెగ వారు. సాధారణంగా మహిళలకు 40 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పుట్టినా ఆరోగ్యంగా పుట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటారు. కానీ ఈ తెగ వారు మాత్రం 60 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిస్తారు. అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంటారు.

మరి ఇలా ఉండడానికి వీరి జీవన విధానం ఎలా ఉంటుందో అని ఆరా తీస్తే.. వాస్తవానికి పాకిస్థానీయుల సగటు జీవిత కాలం 67 ఏళ్లు. కానీ హుంజాల సగటు వయసు వందేళ్లు. వీరిలో 90 శాతం మంది అక్ష్యరాస్యులే ఉంటారు. గడ్డ కట్టే చలిలో కూడా చన్నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. ప్రతి రోజు వ్యాయామం చేస్తారు. ఎక్కువ దూరం ఉన్నా నడవడానికే ప్రాధాన్యత ఇస్తారు. స్వయంగా ఆహార పదార్థాలను పండించుకుంటారు. తాజా పండ్లు, కూరగాయలు, పాలు, ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని మాత్రమే హుంజాలు తింటారు. నిల్వ ఆహార పదార్థాలను అసలు ముట్టుకోరు. రోజుకు 2వేల కేలరీలకు మించి ఆహారం తీసుకోరు.

పండ్లలో ముఖ్యంగా ఆప్రికాట్‌ను ఎక్కువగా తీసుకుంటారు. ఈ పండులో ఉండే విటమిన్ బీ-17కు కేన్సర్ వ్యాధిని నిరోధించే లక్షణం ఉంది. అందుకే హుంజాలకు కేన్సర్ అంటే తెలియదు. ఒక్కోసారి రెండు మూడు నెలలపాటు ఆహారాన్ని మానేసి ఆప్రికాట్ పండ్ల నుంచి తీసిన రసాన్ని ఎక్కువగా తాగుతుంటారు. ఇది వారికి సంప్రదాయంగా వస్తున్న ఆచారం. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుంటారు. ఇక్కడ మాత్రమే దొరికే 'తుమురు' టీ చాలా రుచిగా ఉంటుంది. మూలికలతో తయారు చేసే ఈ టీ వల్ల వీరి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అందుకే హుంజాలు 60ల్లో కూడా 20 ఏళ్ల వయసు వారిలా కనిపిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story