మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అవంతి పొరాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు ఎదుట పడటంతో దుండగులు కాల్పులు ప్రారంభించారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం అయ్యాడు. ఘటనా స్థలంలో పేలుడు సామాగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి పారిపోయిన ఉగ్రవాదుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story