వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి - చంద్రబాబు
By - TV5 Telugu |9 Oct 2019 12:39 PM GMT
రాష్ట్రంలో వైసీపీ నేతల అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన బాబు.. పార్టీ నేతలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. ఈ విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తున్న నాయకులను, కార్యకర్తలను అభినందించారు. ఎంపీడీవో సరళ ఉదంతాన్ని ప్రస్తావించిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నింటికీ సీఎం జగన్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com