ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త అందించింది విజయవాడ రైల్వే డివిజన్‌. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొన్నిరోజులపాటు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ పీఆర్వో నుశ్రత్‌.ఎం.మండ్రూప్‌కర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. దాని ప్రకారం రైలు నెంబరు (07053) సికింద్రాబాద్‌ – కాకినాడటౌన్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 9.40కు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు కాకినాడకు చేరుకుంటుంది. అదేవిధంగా అక్టోబర్‌ 13వ తేదీన రైలునెంబరు (07054) కాకినాడటౌన్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు రాత్రి 8 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 7.40కు సికింద్రాబాద్‌ చేరుతుంది.

రైలునెంబరు (07255) నరసాపూర్‌– సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 10,12వ తేదీలలో రాత్రి 6 గంటలకు నరసాపూర్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. రైలునెంబరు (07256) సికింద్రాబాద్‌–నరసాపూర్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 11వ తేదీ రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 6.05కు నరసాపూర్‌ కు చేరుకుంటుంది. రైలునెంబరు (07255) నరసాపూర్‌ – సికింద్రాబాద్‌ ప్రత్యేకరైలు అక్టోబర్‌ 13వ తేదీ రాత్రి 8.50కు నరసాపూర్‌ నుంచి బయలుదేరి మరునాడు ఉదయం 5.50కు సికింద్రాబాద్‌ కు చేరుకుంటుందని పీఆర్వో మండ్రూప్‌కర్‌ వెల్లడించారు. ఈ రైళ్లు విజయవాడ మీదుగా రాక, పోకలు సాగిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story