కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్ !
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై కేంద్రం యాక్షన్ప్లాన్ సిద్ధం చేసింది. పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, అన్ని అగ్రిమెంట్లకు కట్టుబడి ఉంటామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూటిగా చెప్పారు. విద్యుత్ ఒప్పందాలకు మాదీ భరోసా అన్నారామె. కేంద్రం కార్యాచరణతో ఏపీకి తొలి షాక్ తగిలేలా ఉంది.
సౌర, పవన్ విద్యుత్ కంపెనీలకు LCలు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు రెండ్రోజుల డెడ్లైన్ విధించింది. ఆలోగా ఇవ్వకుంటే.. కేంద్ర పూల్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకుండా రాష్ట్రాన్ని నిషేధిస్తామని హెచ్చరించింది. దీంతో.. ఏపీ సర్కారు ఇరకాటంలో పడినట్టు కనిపిస్తోంది. పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారింది. LCలు ఇవ్వడానికి నిధుల కొరత వేధిస్తోంది. ఇవ్వకుంటే కేంద్ర పూల్ నుంచి కరెంట్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండదు. PPAలపై పాలకులు చేసిన రాద్ధాంతమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు వాపోతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com