రైతు భరోసా కార్యక్రమంపై నారా లోకేష్ విమర్శలు

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం జగన్ గారు ప్రవేశపెట్టింది వైఎస్ఆర్ రైతు నిరాశ కార్యక్రమం అన్నారు. ఎన్నికల హామీలో రైతుభరోసా కింద 12వేల 500 ఇస్తామని ప్రకటించి.. ఇప్పుడు కేవలం 7,500 ఇస్తూ రైతులకు రివర్స్ టెండర్ వేశారని విమర్శించారు లోకేష్. 64 లక్షల మంది రైతుల్లో సగం మందిని తగ్గించారని ఆరోపించారు. కులాన్ని చూడం అంటూనే ఓసీలైన రైతులకు మొండిచేయి చూపారంటూ ఎద్దేవా చేశారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మొదట చెప్పి.. ఇప్పుడు విడతల్లో ఇస్తూ మడమ తిప్పారని విమర్శించారు లోకేష్.
కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండిచెయ్యి చూపారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారు. మీ పార్టీ వాలంటీర్లకి నెలకు రూ.8000 ఇస్తూ.. ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 ఇవ్వడం న్యాయమా?#JaganFailedCM#JaganCheatedFarmers
— Lokesh Nara (@naralokesh) October 15, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com