అలా చేస్తే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవు : నారా లోకేష్
By - TV5 Telugu |17 Oct 2019 12:19 PM GMT
ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పరిపాలనపై నియంత్రణ కోల్పోయిన జగన్ ..నియంతలా మారారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పాత్రికేయులను
మట్టుపెడుతున్నారంటూ మండిపడ్డారు.. మరి మీ తుగ్లక్ పాలన గురించి మాట్లాడుకుంటున్న ప్రజలపైనా కేసులు పెడతారా అంటూ నిలదీశారు. పిచ్చిముదిరి ఇలా కేసులు పెడుతూ పోతే రాష్ట్రంలో ఉన్న జైళ్లు కూడా సరిపోవన్నారు లోకేష్. నిజాయితీ ఉంటే కేసులు పెట్టడం మానేసి.. ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com