గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయిన డెడ్బాడీలు
రాయల్ వశిష్ట బోటులో బయటపడిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న బోటును వెలికి తీసిన తర్వాత అందులో 8 డెడ్బాడీస్ ఉన్నట్లు తేల్చారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఒంటిపై దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా గుర్తిస్తున్నారు.. ఇప్పటికి రెండు మృతదేహాలను గుర్తించారు.
ఆధార్ కార్డు ఆధారంగా ఒక మృతదేహం వరంగల్కు చెందిన కొమ్ముల రవిదిగా తేల్చారు.. మరొరిని రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ సంగాడి నూకరాజుగా గుర్తించారు.ఇతనిది కాకినాడ. ఇంకా ఆరు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది..బంధువుల రోదనలతో ఆస్పత్రిలో విషాదం అలుముకుంది. గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయిన డెడ్బాడీలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు...
గోదావరిలో మునిగిపోయిన 38 రోజుల తర్వాత బోటును బయటికి తీశారు.. ఇన్నిరోజులు నీళ్లలోనే ఉండిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అందుకే గుర్తించడం చాలా కష్టం అవుతోంది..మిగతా మృతదేహాలను గుర్తుపడితే బంధువులకు అప్పగిస్తారు. లేదంటే డీఎన్ఏ టెస్ట్లు చేసే అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com