ఆర్టీసీ ప్రైవేటీకరణపై విచారణ వాయిదా
By - TV5 Telugu |8 Nov 2019 7:13 AM GMT
ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్రొఫెసర్ PL విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈనెల 11 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. 5 వేల ఒక వంద రూట్లలో ప్రైవేటీకరణ నిలిపివేసేలా చూడాలని పిటిషనర్ కోరారు. అటు.. కేబినెట్ ప్రొసీడింగ్స్ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com