తెలంగాణలో అరెస్ట్ల పర్వం..
By - TV5 Telugu |8 Nov 2019 10:19 AM GMT
శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్బండ్కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మిలియన్ మార్చ్ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది జేఏసీ. పలు పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మికులును హైదరాబాద్ తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ నిర్భందాలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు.. పలు పార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకుంటారు. హైదరాబాద్ విద్యానగర్లో ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com