అద్దె అడిగితే ఇంటికి నిప్పు పెట్టి..

అద్దె అడిగితే ఇంటికి నిప్పు పెట్టి..

f

ఇంటి కిరాయి అడిగితే ఇంటినే తగలబెట్టిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ కు చెందిన కమలమ్మ తన ఇంటిని విజయ్ అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. విజయ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా విజయ్ తాగుడుకు బానిస అయ్యాడు. భార్యతో నిత్యం గొడవపడుతున్నాడు. గత ఐదు నెలలుగా ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. దీంతో కమలమ్మ వెంటనే డబ్బులు ఇవ్వాలని.. లేదంటే ఇల్లు ఖాళీ చేయాలని నిలదీసింది. దీంతో మద్యం మత్తులో ఉన్న విజయ్.. ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో ఇల్లంతా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. అద్దె అడిగితే ఇంటికే నిప్పు పెట్టాడని.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story